న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు భగ్గుమన్నాయి. వరుసగా వారం రోజులపాటు పెరిగిన పెట్రోల్ ధరలు మంగళవారం ఆగిపోయాయి. అయితే రెండు రోజుల పాటు పెట్రోల్ ధరలు పెరగలేదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి వినియోగదారులపై భారం మోపాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటరు పెట్రోల్పై 35 పైసల చొప్పున పెంచాయి.
దీంతో ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.75 అయింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.79గా ఉంది. ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ. 101.40 కాగా, ఢిల్లీలో రూ. 93.52గా ఉంది. పెట్రోల్ ధరలు పెంచడం గత రెండు వారాల్లో ఇది 13వ సారి, కాగా డీజిల్ రేట్లు పెంచడం మూడు వారాల్లో ఇది 16వ సారి.
అక్టోబర్ 12, 13 తేదీల్లో పెట్రోల్ ధరలు పెంచలేదు. ఈ రెండు రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100పైనే ఉన్నది. కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, కేరళ, కర్ణాటక, లెహ్లో డీజిల్ ధరలు పెరిగాయి.