న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉన్నది. గత మంగళవారం (మార్చి 22) నుంచి ఒక్కరోజు మినహా (మార్చి 24న) ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బండ్లు బయటకు తీయాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజు అటూఇటుగా పెట్రో, డీజిల్పై 90 పైసల చొప్పున వడ్డిస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. గత తొమ్మిది రోజుల్లో లీటరుపై మొత్తంగా రూ.5.60 భారం మోపాయి.
పెట్రో బాదుడులో ఎనిమిదో రోజైన నేడు లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్పై 87 పైసల చొప్పున పెంచాయి. దీంతో హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.114.51కి చేరగా, డీజిల్ ధర రూ.100 దాటింది. ప్రస్తుతం డీజిల్ రూ.100.70కు చేరింది.
ఇక దేశరాజధాని న్యూఢిల్లీలో 80 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.101.01కి చేరగా, డీజిల్ రూ.92.27కు, ముంబైలో పెట్రోల్ రూ.115.88 (84 పైసలు), డీజిల్ రూ.100.10 (85 పైసలు), చెన్నైలో పెట్రోల్ రూ.106.69 (75 పైసలు), డీజిల్ రూ.96.76 (76 పైసలు), కోల్కతాలో పెట్రోల్ రూ.110.52 (84 పైసలు), డీజిల్ రూ.95.42 (80 పైసలు)గా ఉన్నాయి.