లక్నో : ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. 36 గంటలుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంటి పైకప్పు కుప్పకూలడంతో అఫ్సానా అనే మహిళతోపాటు ఆమె ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
స్థానికులు విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి బయటకు తీసి హుటాహుటిన దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ప్రమాద సమయంలో తండ్రితోపాటు మరో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.