న్యూఢిల్లీ, జూన్ 14: నిరవధికంగా కొనసాగుతున్న పెట్రో మంటతో హైదరాబాద్లో పెట్రోల్ ధర సెంచరీని దాటింది. ఇప్పటికే ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటగా.. తాజాగా హైదరాబాద్లోనూ రూ.100 దాటిపోయింది. సోమవారం కూడా లీటరు పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 30 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.100.20కు పెరుగగా.. డీజిల్ ధర రూ.95.14కు చేరింది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, లఢక్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిన విషయం తెలిసిందే. మే 4 నుంచి ఇప్పటి వరకు 24సార్లు పెరిగిన ఇంధన ధరలను కలిపి లెక్కిస్తే లీటరు పెట్రోల్పై రూ.6.01, డీజిల్పై రూ.6.55 పెరిగింది.