Infosys Vs RSS | ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్పై ఆరెస్సెస్ అధికార పత్రిక పాంచజన్యలో చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఖండించారు. ఇది కేవలం ఇన్ఫోసిస్పై మాత్రమే కాదు.. దాని వ్యవస్థాపకులపైన కూడా వ్యక్తిగత దాడి అని ఆదివారం పేర్కొన్నారు. దేశద్రోహ కుట్రకు పాల్పడినందు వల్లే ఐటీ శాఖ వెబ్సైట్లో సాంకేతిక లోపాలు తలెత్తేలా ఇన్ఫోసిస్ చేసిందని ఎలా అనగలరని నిలదీశారు.
ఈ వివాదం అంతా అసాధారణం. అవాంఛనీయం.. అకృత్యం. జీఎస్టీ ప్లాట్ఫామ్ లేదా ఇన్కం టాక్స్ ప్లాట్ఫామ్కు సంబంధించిన సమస్యలు ఇన్ఫోసిస్, కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోనివి. ఆర్థిక శాఖ, ఇన్ఫోసిస్ మాత్రమే పరిష్కరించుకోవాల్సిన అంశాలివి. కానీ ఇన్ఫోసిస్పై ఆరెస్సెస్ అధికార పత్రిక చేసిన దాడి కేవలం ఆ సంస్థపై మాత్రమే కాదు.. సంస్థ వ్యవస్థాపకులపై వ్యక్తిగత దాడి అని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ఖండనార్హం అని స్పష్టం చేశారు.
వాస్తవంగా పాంచజన్యలో వచ్చిన వ్యాసం దేశద్రోహం అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ఆధునిక భారత పారిశ్రామిక నిర్మాతల్లో ముగ్గురు లేదా నలుగురు ఉంటారు. వారిలో నారాయణ మూర్తి అగ్రస్థానంలో ఉంటారని జైరాం గుర్తు చేశారు. అటువంటి గొప్ప వ్యక్తి సారథ్యంలోని సంస్థ.. నక్సల్స్కు, తుక్డే తుక్డే గ్యాంగ్కు మద్దతు ఇస్తుందని పేర్కొనడం పూర్తిగా బోగస్ అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాసకర్త అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని ఆరెస్సెస్ తర్వాత ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రిలయన్స్కు లక్ష కోట్ల లబ్ధి.. టాప్-9 బెనిఫిట్ ఎంతంటే?!
హైదరాబాద్లో పవర్గ్రిడ్ చార్జింగ్ స్టేషన్! ఎప్పుడంటే?!
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!