రంగారెడ్డి, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): సమీకృత మార్కెట్లను నిర్మించేందుకు ప్రతిపాదనలను రూ పొందించాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురు వారం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సి పాలిటీ కమిషనర్లు, మేయర్లు, చైర్మన్లతో తన కార్యా లయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, అద నపు కలెక్టర్ ప్రతీక్జైన్, ఎమ్మెల్యేలు కాలె యాద య్య, మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్య యాదవ్, ప్రకాశ్గౌడ్, జైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ…జిల్లాలోని ప్రతి మున్సి పల్ కార్పో రేషన్, మున్సి పాలిటీల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న అనువైన స్థలాలను గుర్తించి వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్లను నిర్మించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూ. 500 కోట్లు ఖర్చు చేయను న్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి స్థలాల గుర్తింపు, నిర్మాణపు పనులను యుద్ధ ప్రాతిపదికన చేప ట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీ, కార్పోరేషన్ల న్నింటికీ ప్రతి నెల రూ. 148 కోట్లు విడుదల చేస్తున్నట్లు వివరించా రు.
ప్రతి ఏడాది సగటున జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ. 75 కోట్లు అందజేస్తున్నామన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరే షన్లు సుమారు రూ. 450 కోట్ల వార్షిక బడ్జెట్ను కలిగి ఉన్నాయని గుర్తు చేశారు. వీటి రూపురేఖలు సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. పౌరుల భాగస్వామ్యం మరింతగా పెంచి, సేవలను మెరుగుపర చడం కోసం అధికారులు కృషి చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేప ట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పారిశుధ్యం, పచ్చదనం, పౌరసేవలు మెరుగుపరచడం వంటి ప్రధాన లక్ష్యాలను నిర్ణయించుకో వాలని సూచించారు. ప్రతి వార్డుల్లో పార్కును ఏర్పాటు చేయాలని అధి కారులకు తెలిపారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందన్న విషయాన్ని విస్మరించ రాదని చెప్పారు. ఈ విషయం లో నిర్లక్ష్యంగా వ్యవహారించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు చేపట్టే అధికారాన్ని నూతన చట్టం ద్వారా జిల్లా కలెక్టర్లకు అప్పగించిన విష యాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ప్రతి మున్సిపాలిటీ, మున్సి పల్ కార్పోరేషన్ పరిధిలో ఆదర్శవంతమైన వైకుంఠధామాలను ఏర్పాటు చేయా లని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణం గా వీటిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి ద్వారా ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయా లని ఆమె కోరారు. ఆయా పట్టణం ఇప్పుడు ఎలా ఉంది, రాబోయే రోజు ల్లో ఎలా ఉండాలి అనేది ప్రణాళిక తయారు చేసుకుని అందుకు అనుగు ణంగా నిధులను వినియోగించుకొని క్రమ పద్ధతిలో ప్రగతి సాధించాలని కోరారు. డంపింగ్యార్డులకు సంబంధించిన పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
మహిళకు సీటు రిజర్వ్.. లేటు వయసులో అభ్యర్థి పెండ్లి
కుట్రపూరితంగానే టీటీడీపై తప్పుడు ప్రచారం