న్యూఢిల్లీ, జూన్ 26: రాకెట్ ప్రయోగ వేదికల ఏర్పాటు, నిర్వహణకు ప్రైవేటు సంస్థలను అనుమతించాలని భారత్ నిర్ణయించింది. వీటిని స్వదేశంలో పాటు విదేశాల్లోనూ భారతీయ కంపెనీలు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర సంస్థ ‘ఇన్-స్పేస్’ నుంచి ముందుగా అనుమతి పొందాలి. రాకెట్ ప్రయోగాలు, ప్రయోగ వేదికలు తదితర అంశాల గురించి కేంద్రం ‘డ్రాఫ్ట్ నేషనల్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ పాలసీ-2020’లో సమగ్రంగా పొందుపర్చిందని అగ్నికుల్ కాస్మోస్ సంస్థ సహ వ్యవస్థాకుడు, సీఈవో శ్రీనాథ్ రవిచంద్రన్ తెలిపారు.