ముంబై: మహారాష్ట్రలో వరద ప్రభావిత ప్రాంతాలను తరచూ వీవీఐపీలు సందర్శిస్తుండటం కరెక్టు కాదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ అభిప్రాయపడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల ముంబై సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వీవీఐపీలు వరుసకట్టి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇలా తరచూ వీవీఐపీలు సందర్శించడంవల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని పవార్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ వరుసగా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అయితే దానివల్ల నాకేమీ అభ్యంతరం లేదు. కానీ, ఇలా తరచూ వీవీఐపీల సందర్శనలవల్ల అక్కడ రక్షణ, సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. సహాయక చర్యలతో నేరుగా సంబంధం లేని ఎవరైనా ఆయా ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లకపోతేనే మంచిది అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.