న్యూఢిల్లీ: పోలండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు శుభారంభం దక్కింది. పోటీలకు తొలి రోజైన బుధవారం జరిగిన బౌట్లలో పూనమ్(57కి), విన్క(60కి) ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించారు. పూనమ్ 5-0తో వాలెరియా మెండోజా(కొలంబియా)పై అలవోక విజయం సాధించింది. మరోవైపు 60కిలోల బౌట్లో విన్క 3-2తో దరియా పాటిలీవా(రష్యా)పై విజయంతో ముందంజ వేసింది.