నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఫులాంగ్ చౌరస్తా వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులని పరిశీలించారు. ఫులాంగ్ చౌరస్తా వద్ద నాటిన పాల్మ్ ట్రీలని పరిశీలించారు. ప్రస్తుతం వేసవి కాలం అయినందున చెట్లకి సరిపడా నీళ్లు పట్టాలని అధికారులకు సూచించారు. ఫులాంగ్ బ్రిడ్జి పైనా నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ను పరిశీలించి కాంట్రాక్టర్ కి పలు సూచనలు చేశారు. పనుల్లో నాణ్యాతా ప్రమాణాలు పాటించాలన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు పాల్గొన్నారు.