సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 5 : ఒక వైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం బాబూ జగ్జీవన్రామ్ 114వ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగ్జీవన్రామ్ జీవితకాలంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొన్నారని, సంఘ సంస్కరణోద్యమంలో తనవంతు పాత్ర పోషించారని అన్నారు. అటువంటి మహనీయుల ఆశయాలు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాకారమవుతున్నాయని తెలిపారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ నవ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, కౌన్సిలర్లు తాహెర్ పాషా, చింతలపాటి భరత్ మహాజన్, ఊట్కూరి సైదులు, నాయకులు గండూరి ప్రకాశ్, చింతలపాటి చిన్న శ్రీరాములు, ఉప్పల ఆనంద్, కక్కిరేణి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా కన్నుమూత