హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,384 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా బారినపడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి మరో 2,242 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,379 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 1,08,696 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 307 కరోనా కేసులు నమోదయ్యాయి.