ప్రైవేటు దవాఖానలు ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలి
ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 14 : కొవిడ్ చికిత్సను అందించే ప్రైవేట్ దవాఖానలు ఐసీఎమ్మార్ నిబంధనలు పాటించాలని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు నడుచుకోవాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ సూచించారు. జగిత్యాలలోని ఐఎంఏ హాలులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఎమ్మెల్యే బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరో నా బాధితులకు చికిత్స అందించేందుకు దరఖాస్తు చేసుకున్న నాలుగు ప్రైవేటు హాస్పిటల్స్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కరోనాకు జిల్లా ప్రధాన దవాఖానలో కూడా చికిత్స అందిస్తున్నామన్నారు. ఇండ్లలో వసతులు లేని బాధితుల కోసం జేఎన్టీయూ కళాశాలలో వంద మంది కి సరిపడా వసతులతో ఐసొలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడమే మార్గమన్నారు. కొవిడ్కు చికిత్స అందించేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన ప్రైవేటు దవాఖానాలకు అనుమతి పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో డీఎంఅండ్హెచ్వో పుప్పాల శ్రీధర్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో జైపాల్రెడ్డి, జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ సుదక్షిణాదేవి, ఆర్ఎంవో రామకృష్ణ, ఐఎంఏ జగిత్యాల అధ్యక్షుడు నరహరి, తదితరులు పాల్గొన్నారు.