న్యూఢిల్లీ, జూలై 1: పండుగల పేరుతో జంతుబలి జరుగకుండా చూడటానికి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్’ (పెటా) కోరింది. ఈ మేరకు గురువారం ఓ లేఖ రాసింది. చట్టంలోని కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు పండుగల సందర్భంగా జంతుబలికి పాల్పడుతున్నారని పెటా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నిబంధనలను తొలగిస్తే జంతుబలికి అడ్డుకట్ట వేయొచ్చని సూచించింది.