న్యూఢిల్లీ, జూలై 15: పెన్షనర్లు పెన్షన్ స్లిప్ కోసం ప్రతినెలా బ్యాంకుకు వెళ్లకుండా కేంద్రం కొత్త తరహా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పెన్షనర్ల ఖాతాలో డబ్బు జమ కాగానే.. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్పై ఉన్న వాట్సాప్కు గానీ, వారి మెయిల్కు గానీ పెన్షన్ స్లిప్పును పంపించాలని సూచించింది. ఈ సూచనను బ్యాంకులు స్వాగతించాయి.