లక్నో: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ, పలువురు పార్టీ నేతలతోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ అంశంపై న్యాయ విచారణ జరిపించాలని యూపీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై గవర్నర్కు వినతి పత్రం సమర్పించేందుకు కాంగ్రెస్ నేతలు గురువారం పాదయాత్రగా రాజ్భవన్కు బయలుదేరారు. ఉదయం గృహ నిర్బంధంలో ఉన్న యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ కూడా ఇందులో పాల్గొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ, పలువురు నేతలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు.