ముంబై: పెగాసస్ స్పైవేర్తో రాజకీయ నేతలు, జర్నలిస్టులపై గూఢచర్యానికి పాల్పడేందుకు ఎవరు డబ్బులు ఇచ్చారని కేంద్ర ప్రభుత్వాన్ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. గూఢచర్యాన్ని జపాన్లోని హిరోషిమా నగరంపై అణుబాంబు దాడితో పోల్చారు. రెండిటికీ తేడా లేదన్నారు. ‘నాడు హిరోషిమాలో ప్రజలు చనిపోయారు. పెగాసస్తో స్వేచ్ఛ మరణించింద’ని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీ మన ల్ని మళ్లీ బానిసత్వంవైపు తీసుకువెళ్లిందని ‘సామ్నా’ పత్రికలో రాసిన వ్యాసంలో వ్యాఖ్యానించారు. మరోవైపు పెగాసస్ స్పైవేర్ గూఢచర్యంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా చూడాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.