న్యూఢిల్లీ: పెగాసస్ గూఢచర్యం వ్యవహారం వరుసగా రెండోరోజూ లోక్సభను స్తంభింపజేసింది. పెగాసస్పై కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నినాదాలతో సభ హోరెత్తింది. సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా పలుమార్లు వాయిదా పడింది. ఇక చేసేది లేక సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. బక్రీద్ సందర్భంగా బుధవారం సెలవు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనతో రాజ్యసభ పలుమార్లు వాయిదాపడింది.