శ్రీనగర్ : పీడీపీ నేత నయీమ్ అక్తర్ నెల తరువాత గృహం నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్లో అఖిలపక్ష పార్టీలతో నిర్వహించనున్న సమావేశానికి ముందు ఆయన విడుదల కావడం ప్రధానం సంతరించుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 24న జమ్ముకశ్మీర్లో పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్తోసహా వివిధ ప్రాంతీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. గతంలో పీడీ యాక్టుపై అరెస్టయిన నయీమ్ అక్తర్ను పోలీసులు ఐదు నెలలుగా శ్రీనగర్లోని ఎమ్మెల్యే హాస్టల్లో ఉంచారు. మే 10న ఆయన అక్కడి నుంచి విడుదలయ్యారు. గతేడాది జమ్ముకశ్మీర్లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు (డిసెంబర్ 21న) పీడీపీ నేతలు అక్తర్, సర్తాజ్ మద్నితోసహా పలువురు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సర్తాజ్ మద్ని స్వయానా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి దగ్గరి బంధువు.