పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) లీడర్ తేజస్వి యాదవ్పై ఎఫ్ఐఆర్ నమోదుకు పాట్నా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 సాధారణ ఎన్నికల్లో లోక్సభ టికెట్ ఇస్తానని చెప్పి, రూ. 5 కోట్లు తీసుకుని టికెట్ ఇవ్వకుండా తేజస్వి యాదవ్ తనను మోసం చేశారంటూ సంజీవ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి పాట్నా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. తేజస్విపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించింది.
తేజస్వి పేరుతో పాటు ఆయన సోదరి మీసా భారతి, కాంగ్రెస్ నాయకుడు మోహన్ జా, దివంగత నేత సదానంద్ సింగ్, ఆయన కుమారు శుభానంద్ ముఖేష్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజేశ్ రాథోడ్ పేర్లను కూడా పిటిషన్లో ప్రస్తావించారు. సంజీవ్ కుమార్ సింగ్ కాంగ్రెస్ మద్దతుదారుడు. కాగా భగల్పూర్ సీటు నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
కోర్టు ఆర్డర్పై తేజస్వి యాదవ్ స్పందించారు. ఈ విషయంలో కోర్టు నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేలితే.. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఆ వ్యక్తికి రూ. 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని తేజస్వి ప్రశ్నించారు.