ముంబై: దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి డాక్టర్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్ ఐసీయూలో చేరిన ఘటన మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రభుత్వ దవాఖానలో జరిగింది. అలీబాగ్ జిల్లా జనరల్ దవాఖానలోని కొవిడ్ సెంటర్లో 55 ఏండ్ల ఓ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. అయితే నాలుగు రోజుల క్రితం దవాఖానలో చేరాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో డ్యూటీలో ఉన్న డాక్టర్పై అతడు దాడికి పాల్పడ్డాడు. సెలైన్ స్టాండ్తో కొట్టడంతో డాక్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో డాక్టర్ ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం ఆ వైద్యుని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే డాక్టర్పై ఎందుకు దాడి చేశాడనే విషయం తెలియాల్సి ఉందని వెల్లడించారు.