న్యూఢిల్లీ: ఫేస్బుక్ ఇండియా, గూగుల్ ఇండియాకు ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమన్లు జారీ చేసింది. జూన్ 29వ తేదీన కమిటీ ముందు హాజరుకావాలని సోషల్ మీడియా సంస్థలకు ఆ ప్యానెల్ ఆదేశించింది. పౌరుల హక్కులను రక్షించడం, ఆన్లైన్ న్యూస్ మీడియా దుర్వినియోగం అంశంపై ఎఫ్బీ, గూగుల్ సంస్థల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. రెండు సంస్థలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కమిటీ తన ఆదేశాల్లో పేర్కొన్నది. సోషల్ మీడియా, ఆన్లైన్ న్యూస్లో దుర్వినియోగాన్ని ఎలా అరికడుతారన్న అంశంపై వివరణ ఇవ్వాలని జూన్ 18వ తేదీన ట్విట్టర్ను స్టాయీ సంఘం ప్రశ్నించిన విషయం తెలిసిందే.