హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వివిధ శాఖల వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. భూముల గుర్తింపు, అభివృద్ధి, వేలానికి నిర్దిష్ట మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం జారీచేశారు. వేలం బాధ్యతను నోడల్ ఏజెన్సీకి అప్పగించిన ప్రభుత్వం, ఈ ప్రక్రియను సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు నాలుగు కమిటీలను ఏర్పాటుచేసింది. జిల్లాల్లో ప్రజా అవసరాలకు ఉపయోగపడని భూములను కలెక్టర్లు సేకరించాల్సి ఉంటుంది. కనీసం వెయ్యి ఎకరాలకు తగ్గకుండా ల్యాండ్బ్యాంకు ఏర్పాటుచేయనున్నారు. మార్కెట్ డిమాండ్, ధరలను బట్టి భూములను ఈ-వేలం ద్వారా అమ్మాలని ప్రభుత్వం సూచించింది. గుర్తించిన భూములను వేలానికి ముందే లేఔట్స్గా మార్చి టీఎస్ బీపాస్ ద్వారా అన్ని అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకొంటారు. లేఅవుట్స్లకు అన్నిరకాల వసతులు ఏర్పాటు చేస్తారు.