న్యూఢిల్లీ, జూలై 31: పెగాసస్ గూఢచర్యం తదితర అంశాలపై పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనతో వర్షాకాల సమావేశాలు ఇప్పటివరకు కేవలం 18 గంటల పాటే జరిగాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తం 107 గంటల పాటు సమావేశాలు జరుగాల్సి ఉంది. అందులో 17 శాతం వ్యవధిలో మాత్రమే కొనసాగాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సమావేశాల సమయం 89 గంటలు వృథా కావడంతో రూ.133 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపాయి. జూలై 19న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి.