హైదరాబాద్: నగరంలో రెండు రోజుల క్రితం కూకట్పల్లిలో జరిగిన ఏటీఎం దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన నిందితుడి నుంచి సేకరించిన వివరాలను పోలీసులు నేడో రేపో వెల్లడించే అవకాశం ఉంది.
రెండు రోజులక్రితం కూకట్పల్లి పటేల్కుంటలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద ఏటీఎంలో సిబ్బంది డబ్బులు నింపుతున్నారు. అదేసమయంలో ఆల్విన్ కాలనీ వైపు నుంచి పల్సర్ బైక్పై వద్దకు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. ఇద్దరు ఏటీఎం సిబ్బందితోపాటు సెక్యూరిటీ గార్డుపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అనంతరం వారి వద్ద ఉన్న రూ.5 లక్షలు దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో ఏటీఎం సిబ్బంది అలీ బేగ్, శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ అలీ బేగ్ మరణించగా, శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గాలింపు ప్రారంభించారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..