విప్ బాల్క సుమన్
బొక్కలగుట్ట, క్యాతనపల్లిలో పర్యటన
పాలవాగు వంతెన, చెక్డ్యాం, రోడ్డు , స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్ ప్రారంభం
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
రంజాన్ కానుకల పంపిణీ
రామకృష్ణాపూర్, మే 1 : మారుమూల గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని చెన్నూరు ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మం దమర్రి మండలంలోని బొక్కలగుట్ట, క్యాతనపల్లి మున్సిపాలిటీలో శనివారం ఆయన పర్యటించారు. పాలవాగుపై రూ. 3.86 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి, చెక్ డ్యామ్, హైవే నుంచి గ్రామం వరకు వేసిన ఆర్ అండ్బీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయం లో రూ. 1.5 కోట్లతో కొనుగోలు చేసిన 18 స్వచ్ఛ్ ఆటోలు, రూ. 18 లక్షలతో కొనుగోలు చేసిన ట్రాక్టర్, నీటి ట్యాంకర్ను ప్రారంభించారు. అనంతరం ఏడుగురు లబ్ధిదారులకు రూ. 3 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశా రు. అలాగే 300 నిరుపేద ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ. 10 కోట్ల పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మిస్తామని, శ్మశాన వాటికకు రూ. కోటి మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బొక్కలగుట్ట గ్రామ సర్పం చ్ బొలిశెట్టి సువర్ణ, మందమర్రి మండల జడ్పీటీసీ ఏల్పుల రవి, మండల అధ్యక్షురాలు గుర్రం మంగ, అధికారులు, నాయకులు మాజీ మండలాధ్యక్షుడు బొలిశెట్టి కనకయ్య, వార్డు సభ్యులు, ప్రజలు, క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు యాకూబ్అలీ, సుదర్శన్గౌడ్, రజియా, కమిషనర్ వెంకటనారాయణ, మేనేజర్ కీర్తీ నాగరాజు, సిబ్బంది, నాయకులు అబ్దుల్ అజీజ్, రామిడి కుమార్, నర్సింగరావు, అలుగుల సత్తయ్య, ఎర్రబెల్లి రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.
వైరస్ నిర్మూలనకు కృషి చేయాలి
మందమర్రి మే 1: కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అధికారులకు సూచించారు. మం దమర్రి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం 24 స్వచ్ఛ ఆటోలు, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ను ప్రారంభించారు. అలాగే 80 మంది పారిశుధ్య కార్మికులకు యూనిఫారాలు, కాస్మొటిక్స్ను పంపిణీ చేశారు. అనంతరం తహసీల్ కార్యాలయం వద్ద 33 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులనుర, రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, బెల్లంపల్లి ఏసీపీ రహమాన్, ము న్సిపల్ ఏఈ అచ్యుత్, తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, జడ్పీటీసీ వేల్పుల రవి, చిర్రకుంట, అందుగులపేట, శంకర్పల్లి సర్పంచ్లు ఒడ్నాల కొమరయ్య, తిరుపతిరెడ్డి, స దయ్య, కోఆప్షన్ సభ్యుడు నజీర్, టీఆర్ఎస్ నా యకులు జే.రవీందర్, బడికెల సంపత్, కొంగల తిరుపతి రెడ్డి, తోట సురేందర్, భట్టు రాజ్కుమార్, మేడిపల్లి మలేశ్, ఉప్పుల కృష్ణ, ఎర్ర రాజు, భూపెల్లి కనకయ్య పాల్గొన్నారు.