చండీగఢ్: పంజాబ్ సీఎంగా చరణ్జీత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా పంజాబ్ తొలి దళిత సీఎంగా రికార్డుల్లోకెక్కారు. ఆయనతో పాటు సుఖ్జిందర్ సింగ్ రంధావా, ఓం ప్రకాశ్ సోని ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణం అనంతం చన్నీ మాట్లాడారు. కొత్త సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమానికి తమ ప్రభుత్వం మద్దతునిస్తుందని పేర్కొన్నారు. ప్రమాణ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.
రాష్ర్టానికే అవమానం
చరణ్జీత్సింగ్ను సీఎం చేయడం రాష్ర్టానికే అవమానం అని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు. ఆయనపై ‘మీ టూ’ ఆరోపణలున్నాయని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2018లో చరణ్జీత్ సింగ్ ఓ ఐఏఎస్ అధికారిణికి ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్ పంపినట్టు ఆరోపణలున్నాయి.