ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోగల జకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల్లో 22 మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆ దుర్ఘటన గుండెను పిండేసే అంతటి విషాదకర ఘటన అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర మనోవేదన కలిగించిందని ట్వీట్ చేశారు. ఇలాంటి విషాద ఘడియలో మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ప్రజలకు ఫేస్ మాస్కులు పంచిపెట్టిన దేవుళ్లు..!
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
మామిడి పండ్లు తింటే ఇన్ని లాభాలా..!
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..