National
- Dec 26, 2020 , 12:32:12
ఇంద్రేశ్వర్ సెక్టార్లో పాక్ కాల్పులు

శ్రీనగర్ : కుక్క తోక వంకర అన్న చందంగా పాక్ వక్ర బుద్ధి మారడం లేదు. తీర నియంత్రణ రేఖ వెంట షెల్లింగ్ చేస్తూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్లోని పలు అంతర్జాతీయ సరిహద్దుల్లో, సెక్టార్లలో కాల్పులకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా ఇంద్రేశ్వర్నగర్ సెక్టార్లో భారత సైనిక పోస్టులే లక్ష్యంగా దాడులకు దిగింది. సుమారు నాలుగు గంటల పాటు పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు కాల్పులు కొనసాగాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బెటాలియన్ సైతం సరైన సమాధానం ఇచ్చింది. కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- బీహార్లో నేరాలు ఎందుకు పెరిగాయి?
- కమలాహారిస్కు అభినందనలు తెలిపిన మైక్ పెన్స్
- కరోనా నియంత్రణ చర్యలు అద్వితీయం : మంత్రి పువ్వాడ
- ఆక్సిజన్ సిలిండర్ల కోసం భారీ క్యూ లైన్లు..
- వ్యాక్సిన్పై అపోహలు అవసరం లేదు : మంత్రి గంగుల కమలాకర్
- తెలుగు రాష్ర్టాల సీఎంలకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ
- సోనూసూద్ టైలరింగ్ షాప్.. కస్టమర్ దుస్తులకు నో గ్యారంటీ! ..వీడియో వైరల్
- రామ్ చరణ్, రోజా.. ఇద్దరూ ఇష్టపడేది ఆ హీరోనే
- టీకా దుష్ప్రభావాలపై పరిహారం పొందాలంటే..
- టెస్లాతో భాగస్వామ్యమా? నో వే అంటున్న టాటా
MOST READ
TRENDING