హైదరాబాద్ : నగరంలోని కూకట్పల్లి పరిధి ప్రగతినగర్లో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు నుండి బైక్పై మితిమీరిన వేగంతో వెళుతున్న యువకులను ప్రశ్నించినందుకు ఓ కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దాడిలో మొత్తం 20 మంది యువకులు పాల్గొన్నారు. వీరి దాడిలో కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు.