శ్రీనగర్, జూన్ 21: జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తాయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ ముదసిర్ పండిట్తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని సోపోర్లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. 2019 నుంచి లష్కరే టాప్ కమాండర్గా ఉన్న పండిట్.. గతంలో తొమ్మిది మంది సైనికులు, నలుగురు పౌరులు, ముగ్గురు సర్పంచ్లను చంపిన కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.