ఓ వైపు కోవిడ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు ఆక్సిజన్ సిలెండర్ల కొరత ఏమాత్రం తగ్గలేదు. రోజురోజుకి ఆక్సిజన్ సిలెండర్ల అవసరం పెరుగుతుండటంతో కొందరు వీటిని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇంకొందరు లూటీ చేస్తున్నారు. అలా మధ్యప్రదేశ్ లో ఆక్సిజన్ సిలెండర్లు లూటీ కావడం పరిస్థితి తీవ్రతను అర్థం చేస్తోంది.
దామో జిల్లా ఆసుపత్రిలో కొందరు దుండగలు ఆక్సిజన్ సిలెండర్లను లూటీ చేశారు. గతంలోనూ ఇలా జరిగినట్లు ఆరోపణలురావడంతో కలెక్టర్ రంగంలోకి దిగారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నిందితులపై కేసులు నమోదు చేశారు.