ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ పవర్ప్లే ముగిసేలోపే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మనన్ వోహ్రా(14), కెప్టెన్ సంజూ శాంసన్(1)లను సామ్ కరన్ పెవిలియన్ పంపాడు. 6 ఓవర్లకు రాజస్థాన్ 45/2తో నిలిచింది. ఐతే వికెట్లు పడినా మరో ఎండ్లో జోస్ బట్లర్ దూకుడుగా ఆడుతున్నాడు. 9 ఓవర్లకు రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. ప్రస్తుతం బట్లర్(40), శివమ్ దూబే(13) క్రీజులో ఉన్నారు.