ఇస్లామాబాద్: పాకిస్తాన్లో శాంతిని భారత్ కోరుకోవడం లేదని, తమ దేశంలో అశాంతిని సృష్టించడానికి వారు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని పాకిస్తాన్ అంతర్గత మంత్రి షేక్ రషీద్ అన్నారు. క్వెట్టాలో జరిగిన పేలుడు అనంతరం ఒక ప్రకటన విడుదల చేసి.. భారత్పై తన అక్కసును వెల్లగక్కారు. పేలుడు జరిపిన ప్రాంతం నగరంలోనే అత్యంత సురక్షితమైన ప్రాంతం అని, విదేశీయులు కూడా ఇక్కడి హోటల్లోనే బస చేస్తారని చెప్పారు. విదేశీయులపై కాల్పులకు తెగబడటం ద్వారా పాకిస్తాన్పై వ్యతిరేకత పెంచాలనే దురుద్దేశంతో భారత్ ఇలాంటి పనులకు పాల్పడుతుందని పేర్కొన్నారు.
“భద్రతలో కొంత ఉల్లంఘన జరిగి ఉండటం వల్లనే పేలుడుతో నిండిన కారు హోటల్లోకి ప్రవేశించగలిగింది. పాకిస్తాన్ వ్యతిరేక అంశాలు దేశ శాంతిని దెబ్బతీయాలని కోరుకుంటున్నాయి. అత్యంత సురక్షితమైన ప్రాంతంలో కాల్పులు జరుగడం కొంత ఇబ్బందికరమే. ఇక్కడి ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన చైనా రాయబారి నాంగ్ రోంగ్ కూడా ఇక్కడి హోటల్లోనే బస చేశారు. అయితే పేలుడు జరిగిన సమయంలో ఆయన మరో ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నారు” అని పాకి్ మంత్రి తెలిపారు. దేశంలో శాంతిభద్రతల పరిస్థితిపై మరిన్ని వివరాలను పంచుకున్న ఆయన.. క్వెట్టా, పెషావర్, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండిలలో కూడా ఇటువంటి దాడుల బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు.
పాకిస్తాన్లో సీనియర్ జర్నలిస్టుపై కాల్పులు
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఐక్యరాజ్య సమితి ముఖ్య కమిటీల్లో భారత్ సభ్యత్వం
చాద్ అధ్యక్షుడు ఇద్రిస్ డెబ్బీ దారుణహత్య
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..