తయారీకి టెండరు జారీచేసిన రక్షణ శాఖ
న్యూఢిల్లీ: భారత నావికాదళాన్ని మరింత శక్తిమంతంగా, శత్రుదుర్భేద్యంగా తయారుచేసేందుకు కేంద్ర రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాముల తయారీకి టెండర్లు జారీచేసింది. ఆత్మనిర్భర్భారత్లో భాగంగా ప్రాజెక్టు-75 ఇండియా కింద స్వదేశీ కంపెనీలు ఇండియన్ మజగాన్ డాక్యార్డ్స్, ఎల్అండ్టీకి తయారీ టెండర్లు జారీచేసినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ‘వ్యూహాత్మక భాగస్వామి మోడల్’ కింద ఈ సబ్మెరైన్లను రూ.43వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. దేశీయ సంస్థలు, అంతర్జాతీయ ఉత్పత్తిదారులతో భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకొని భారత్లోనే అధునాతన ఆయుధ వ్యవస్థను ఉత్పత్తి చేయటం దీని ముఖ్య ఉద్దేశం. మజగాన్ డాక్యార్డ్స్, ఎల్అండ్టీ కంపెనీలు.. రష్యా, దక్షిణ కొరియా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్కు చెందిన నౌకానిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని సబ్మెరైన్లను నిర్మిస్తాయి.