National
- Jan 13, 2021 , 13:31:44
ఆ 60 గ్రామాల్లో బీజేపీ నాయకులపై నిషేధం

హర్యానా : రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలపై హర్యానా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతులను ఆందోళనలను పట్టించుకోని భారతీయ జనతా పార్టీ, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) నాయకులపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి రానివ్వొద్దని 60 గ్రామాల ప్రజలు, రైతులు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ప్రధానంగా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యేలు రైతుల నుంచి తీవ్రమైన నిరసనలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలపై చర్చించేందుకు మోదీతో సమావేశం అవుతానని జేజేపీ ఎమ్మెల్యే, హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు. అయితే హర్యానాలో బీజేపీ - జేజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- గీతా గోపీనాథ్పై బిగ్ బీ అనుచిత వ్యాఖ్యలు! నెటిజన్ల ట్రోల్స్
- సృష్టి మూలంతో అనుసంధానం!
- ఇలా చేస్తే మీ వాట్సాప్ భద్రం..!
- తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా పట్లొల్ల మోహన్ రెడ్ది
- 28 నుంచి మణుగూర్-సికింద్రాబాద్ మధ్య రైలు కూత!
- మరోసారి రుజువైన సింప్సన్ జోస్యం!
- 2,779 కరోనా కేసులు.. 50 మరణాలు
- అందుకే నో చెప్పిన సింగర్ సునీత
- బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ బడుగుల
- నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో రానున్న నితిన్..
MOST READ
TRENDING