మంత్రి ఈటల రాజేందర్
మొగుళ్లపల్లి, మార్చి31: ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ కటంగూరి రాంనర్సింహరెడ్డి సేవాతత్పరుడిగా పేరుగాంచారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆకినపల్లి గ్రామంలో అడిషినల్ ఎస్పీ కటంగూరి రాంనర్సింహారెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. రాంనర్సింహారెడ్డి పోలీసు శాఖలో ఉన్నతమైన పదవిలో ఉంటూ ప్రజాసేవకు ఆర్ఎన్ఆర్ సేవాదళ్, కేఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం రాంనర్సింహారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్యలున్నా పరిష్కారానికి సహకారాన్ని అందజేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకే తాను హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన ఆకినపల్లికి వచ్చి ఉంటున్నానన్నారు. కార్యక్రమంలో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ కటంగూరి శ్రీరాంరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, స్నేహితులు పాల్గొన్నారు.