న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి కొవిడ్ బాధితులను రక్షిస్తున్న డాక్టర్లు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్లో కొవిడ్ సోకి 420 మందికిపైగా వైద్యులు కన్నుమూసినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శుక్రవారం వెల్లడించింది.
వీరిలో 100 మందికిపైగా ఢిల్లీకి చెందిన వారేనని పేర్కొంది. గత నెల దేశరాజధాని ఢిల్లీ కరోనాతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ తరువాత అత్యధికంగా బీహార్లో 96 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో 41 మంది, గుజరాత్లో 31 మంది, తెలంగాణలో 20 మంది, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో 16 మంది చొప్పున చనిపోయినట్లు డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.