న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో ఇటీవల గుర్తించిన డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ల మధ్య పెద్దగా తేడా ఏమీలేదని, రెండు స్ట్రెయిన్లు ఒకే మాదిరిగా ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ డైరెక్టర్ సౌమిత్రా దాస్ అన్నారు. ఈ స్ట్రెయిన్లు బీ.1.617 వైరస్ రకానికి చెందినవని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ స్ట్రెయిన్లపై ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు.