హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన అగ్రిటెక్ స్టార్టప్ వన్బాస్కెట్ తన బ్రాంచ్లను విస్తరిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఆగస్టు 2021 నాటికి బెంగళూరు, చెన్నై నగరాల్లో బ్రాంచ్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ శాఖను తెరిచేందుకు అదేవిధంగా ఆన్లైన్ విధానాన్ని బలోపేతం చేసేందుకు మొత్తం రూ.2 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. వన్బాస్కెట్ వాస్తవంగా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో భౌతిక కార్యాలయాన్ని కలిగిఉంది. ఈ సంస్థ దేశీ విత్తనాలు, జన్యుపరంగా మార్పు చెందని వ్యవసాయ ఉత్పత్తుల హైబ్రిడ్ విత్తనాలను అందిస్తుంది.
సిరియల్ ఎంటర్ప్రెన్యూర్స్ మధుసూదన్ రడ్డి, నర్సిరెడ్డి 2019లో వన్బాస్కెట్ను ప్రారంభించారు. ఏడాదిన్నర స్వల్ప కాలంలోనే వన్బాస్కెట్ రైతులు, వినియోగదారుల మధ్య వారధిగా మారింది. అప్పటినుండి ఒక మిలియన్ డాలర్ల ఆదాయ మార్కును అధిగమించింది. వన్బాస్కెట్ ప్లాట్ఫాంపై ఉన్న రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయిస్తుంటారు. ఎంచుకున్న విత్తనం రకం నుండి మిల్లింగ్, నిల్వ పరిస్థితుల వరకు పూర్తి ప్రామాణికతను కలిగి ఉంటుంది.