హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 917 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,006 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసులు 6,23,510కి పెరిగాయి. 6,06,461 మంది కోలుకున్నారు. మరో 13,388 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3661కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,09,802 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.