న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీలో భారత్ మరో మైలు రాయిని అధిగమించింది. కేవలం 92 రోజుల్లో అత్యంత వేగంగా 12 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటన చేసింది. 12 కోట్ల టీకా డోసుల లక్ష్యం చేరుకోవడాఇకి యూఎస్లో 97 రోజులు పట్టగా చైనాలో 108 రోజుల సమయం పట్టిందని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
‘ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా భారత్ 92 రోజుల్లో 12 కోట్ల డోసులు పూర్తి చేసుకుంది. తాజా గణాంకాల ప్రకారం నేటికి దేశంలో మొత్తం 12.26 కోట్లకు పైగా టీకాలు ఇచ్చాం. అందులో ఆరోగ్య సిబ్బందిలో 91 లక్షల మందికి పైగా తొలి డోసు టీకా తీసుకోగా, 57 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్లో 1.12 కోట్లకు పైగా తొలి డోసు తీసుకోగా 55 లక్షలకు పైగా రెండో డోసు తీసుకున్నారు’ అని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
‘8 రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ 59.5శాతంగా నమోదైంది. అందులో గుజరాత్లో 1.03కోట్లు, మహారాష్ట్రలో 1.21 కోట్లకు పైగా, యూపీలో 1.07 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. 12 కోట్ల మైలు రాయి చేరుకోవడానికి యూఎస్లో 97, చైనాలో 108 రోజులు సమయం పట్టింది’ అని కేంద్రం పేర్కొన్నది. కాగా, గడిచిన 24 గంటల్లో 26 లక్షల డోసులు పంపిణీ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో