ఊట్కూర్, జూలై 7 : రైతులు పంట దిగుబడి కోసం అ నేక రకాల ఎరువులను వాడుతుంటారు. అందులో భాగం గా ఎరువులను వేసే క్రమంలో మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వాడడం వలన భూసారం తగ్గడంతోపా టు ఆహార పంటలు విషతుల్యం కావడానికి ఆస్కారం ఉం ది. విచ్చలవిడిగా రసానిక ఎరువుల వినియోగం తగ్గించి సహజ ఎరువుల వినియోగం ద్వారా పంట దిగుబడి పెరగడంతోపాటు భూసారం దెబ్బతినకుండా కాపాడుకోగలం. ముఖ్యంగా వరి సాగు చేసే పంట పొలాల్లో జీలుగ సాగు చేయడం వలన అనేక లాభాలు చేకూరుతాయి. పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంచుకోవచ్చనే ఆలోచనలో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈనేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతు లు పచ్చిరొట్ట, జీలుగ సాగుతో ఖర్చులు తగ్గించుకుంటున్నారు. పచ్చిరొట్ట సాగుతో భూసారాన్ని పెంచుకోవడమే కాకుండా మెరుగైన దిగుబడులు పొందుతున్నారు. వ్యవసాయ శాఖ కృషితో ఏటా పచ్చిరొట్ట సాగు పెరుగుతున్నది.వానకాలం, యాసంగి సీజన్లో జీలుగ సాగుచేసి భూ మిలో కలియదున్ని భూసారం పెంచుకుంటున్నారు. జీలు గ విత్తనాలను పొలంలో వేసుకొని కలియ దున్నుకోవడం వల్ల భూసారం పెరుగుతుందని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకున్నామని రైతులు సంతోషంతో పేర్కొంటున్నారు. ఈఏడాది వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలను రాయితీ ధరకు అందించడంతో ఎక్కడ చూసినా పచ్చిరొట్ట సాగే కనిపిస్తుండటం గమనార్హం.
పచ్చిరొట్టతో అనేక లాభాలు
పచ్చిరొట్ట వినియోగంతో నేల చౌడుకు గురికాకుండా ఉంటుంది. ఎకరాకు 12-14 కిలోల విత్తనాలను పొలంలో చల్లుకోవాలి. 20 నుంచి 30 రోజుల తర్వాత పొలంలో కలియదున్నాలి. ఇలా చేయడం వలన సేంద్రియ ఎరువులు కుళ్లి మొక్కలకు ఉపయోగపడే రూపంలోకి మారుతాయి. జీలుగ పంటను రొటావేటర్ లేదా ఎద్దుల సహాయంతో దున్నివేయాలి. దీని వలన కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతున్నది.