మెట్పల్లి రూరల్/సారంగాపూర్/ కథలాపూర్ మార్చి 12: మూడేండ్ల ప్రొబెషనరీ కాలం రెండేండ్లకు తగ్గింపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలియడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం జగిత్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
మూడేండ్ల ప్రొబెషనరీ కాలాన్ని రెండేండ్లకు తగ్గింపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలియడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మనసులోని కోరికను నెరవేర్చిందుకు సానుకూలంగా స్పందించిన ఆయనకు కృతజ్ఞతకు పూర్వకంగా మెట్పల్లి మండల పరిషత్ కార్యాలయ, సారంగాపూర్ మండలం పెంబట్ల దుబ్బరాజన్న ఆలయ ఆవరణలో, కథలాపూర్లో శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు ఆయాచోట్ల మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ నిర్ణయాలను అమలు చేస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వానికి అన్నివేళల్లో అండగా నిలబడుతామని స్పష్టం చేశారు. మెట్పల్లిలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, జేపీఎస్లు నవీన్, శ్రీను, రాజు, హరీశ్, రాజ్కుమార్, ప్రశాంత్, రాణాప్రతాప్, కల్యాణ్, విజయలక్ష్మి, కీర్తి, దివ్య, వినీత, సుమలత, సారంగాపూర్లో శివ్పాల్ సింగ్, సంతోష్, శేఖర్, శ్రీనివాస్, తిరుపతి, మౌనిక, సుప్రియ, మహేశ్, నరేశ్, కథలాపూర్లో ముత్యాల రాజశేఖర్, కిరణ్, నర్సారెడ్డి, మహేశ్, రాజేశ్ పాల్గొన్నారు