మా ఓటర్లు సెలవుల్లో ఉన్నారు.. అందుకే ఓడాం

చంఢీఘడ్: హర్యానాలో ఇటీవల జరిగిన అయిదు మున్సిపల్ ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ ఓటమి పాలైంది. దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి సంజయ్ శర్మ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తమ పార్టీ ఓటర్లు సెలవుల మూడ్లో ఉండడం వల్ల.. తమ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందినట్లు ఆయన అన్నారు. బీజేపీ, జనతా జననాయక్ పార్టీ సంయుక్తంగా హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో సోనిపట్, అంబాలా నగరాల్లోనూ మేయర్ రేసును బీజేపీ కోల్పోయింది. హిస్సార్లోని ఉకలానా, రేవారిలోని ధరుహెరాల్లోనూ జేజేపీ ఓడింది. డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో సెలవులు అని, డిసెంబర్ చివర్లో ఇయర్ ఎండ్ కావడం వల్ల ఆ రోజుల్లో ప్రజలు హాలీడే మూడ్లో ఉన్నారని, వాళ్లంతా లాంగ్ ట్రిప్పులకు వెళ్లారని, అయితే సెలవులపై వెళ్లిన పౌరులంతా తమ పార్టీ ఓటర్లే అని బీజేపీ ప్రతినిధి సంజయ్ శర్మ అన్నారు.
తాజావార్తలు
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
- నూతన సచివాలయం, అమరవీరుల స్మారకంపై మంత్రి వేముల సమీక్ష