వరంగల్ అర్బన్ : కమలాపూర్ మండలంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టాలంటే కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కమలాపూర్ మండల ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. ఆదివారం హన్మకొండలో కమలాపూర్ మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు 10 మందితో కూడిన సమన్వయ కమిటీని నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండల,గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశాలను తూచతప్పకుండా పాటించాలన్నారు. మండలంలో ఎలాంటి సమస్య ఉన్నా సమన్వయ కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
సమన్వయ కమిటీ సభ్యుల వివరాలు :
పేరాల సంపత్ రావు,
ఎర్రం ఇంద్రసేన రెడ్డి,
పింగిలి ప్రదీప్ రెడ్డి,
తడక శ్రీకాంత్,
లాండిగే లక్ష్మణ్ రావు,
ఆరేపల్లి నవీన్ కుమార్,
మాట్ల రమేష్,
ఎర్రబెల్లి సంపత్ రావు,
పుల్లూరి రామచందర్ రావు,
ఇమ్మడిశెట్టి శ్రీనివాస్.
ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ పేరియాల రవీందర్, రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు, పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా రామకృష్ణ, నడికూడా మండల అధ్యక్షులు భీముడి నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.