హుజూరాబాద్/హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 23: రాజకీయ దురంధరుడు, సుదీర్ఘకాలం ప్రజల సేవలో తరించిన మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి(76) ఇకలేరు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో శుక్రవారం హఠాన్మరణం చెందారు. అయన మరణం హుజూరాబాద్ ప్రాంత ప్రజల ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మండలంలోని జూపాకలో కేతిరి మాణిక్యమ్మ, నరసింహారెడ్డి దంపతులకు ఐదుగురు కుమారులు. రెండో వా డైన సాయిరెడ్డి 1945 జనవరి 15న జన్మించారు. ఇదే మండలంలోని చెల్పూర్లో విద్యాభ్యాసం ప్రారంభించి అక్కడే 4వ తరగతి వరకు చదివా డు. 5వ తరగతి నుంచి హెచ్ఎస్సీ వరకు హన్మకొండలోని ఎల్బీహెచ్లో చదివాడు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఉస్మానియాలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు. వరంగల్ కలెక్టరేట్లో క్లర్కుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ… దానికి రాజీనామా చేసి హైదరాబాద్లో ని ఏజీ ఉద్యోగంలో చేరారు. అక్కడే ఉస్మానియా నైట్ కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. రిజర్వ్ బ్యాంకులో కొన్ని రోజులు పని చేసిన అనంతరం రాజకీయాలవైపు మరలారు.
తొలి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర..
రిజర్వు బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకొని 1969 లో మర్రి చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజా సమితిలో చేరారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు. ఎన్నో మార్లు జైలు కు వెళ్లారు. తర్వాత హుజూరాబాద్ కోర్టులో లాయర్గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా..
కేతిరి సాయిరెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్ నుంచి మొదలు పెట్టారు. 1972లో జూపాక సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1974, 81లో రెండుసార్లు హుజూరాబాద్ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికైన అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 1989 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా హుజూరాబాద్ నియోజవర్గం నుంచి బరిలోకి దిగి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వొడితల రాజేశ్వరావుపై గెలిపొందారు.
2018లో టీఆర్ఎస్లోకి..
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పటి అధికార కాం గ్రెస్లో చేరారు. 1994లో కమలాపూర్ నియోజకర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్రెడ్డి చేతిలో ఓడి పోయారు. 1999లో హుజూరాబాద్ నుంచి కాం గ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యాడు. 2018లో హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
నేడు జూపాకలో అంత్యక్రియలు
సాయిరెడ్డి మరణంతో స్వగ్రామమైన జూపాక చిన్నబోయింది. ఎలాంటి ఆపద వచ్చినా సాయిరెడ్డి తన సొంత పనిగా స్వీకరించి గ్రామస్తులకు అన్ని రకాల సహాయాలు అందించాడని గుర్తుచేసుకుంటున్నారు. జూపాకలో శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య పుష్పమాలతో పాటు కుమారులు రాజప్రతాప్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, కుమా ర్తె చైతన్యారెడ్డి ఉన్నారు. వీరి కుమారుడు ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉన్నందున అంత్యక్రియలు ఒకరోజు ఆలస్యం కానున్నట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
నివాళుర్పించిన మంత్రి ఈటల..
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్లోని అతని నివాసంలో మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయిరెడ్డి తనదైన శైలితో నియోజవర్గ ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు.
ప్రజాదరణ కలిగిన నేత: వినోద్కుమార్
మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి మృతికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్చైర్మన్ వినోద్కుమార్ ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. ప్రజాదరణ కలిగిన గొప్ప నేత అనిపేర్కొన్నారు. వారి కుటుం బ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవి కూడా చదవండి
లంగా డాన్సులేసే స్టార్లకు 50 కోట్లా.. PVP ట్వీట్ వైరల్
శ్యామ్ సింగరాయ్ లాభాలు తెస్తున్నాడా..?