న్యూఢిల్లీ, జూన్ 30: చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కరోనా సోకి బాధపడి ఉంటే త్వరలో జరుగబోయే సీఏ పరీక్షలకు హాజరుకాకుండా ఉండేందుకు (ఆప్ట్ అవుట్) అనుమతినిచ్చింది. ఆప్ట్ అవుట్కు దరఖాస్తుతోపాటు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ జారీ చేసిన సర్టిఫికెట్ను అందజేస్తే సరిపోతుందని తెలిపింది. ఈసారి పరీక్షకు హాజరుకాకపోయినా దానిని ఒక ‘అటెంప్ట్’గా పరిగణించరాదని ఐసీఏఐను ఆదేశించింది.