జడ్చర్ల దవాఖానలో 20 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు
త్వరలోనే కొవిడ్ వార్డు అందుబాటులోకి
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, మే 27 : కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని, వైరస్ వ్యాప్తి తగ్గాలంటే ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నా రు. జడ్చర్ల ప్రభుత్వ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 20 పడకల కొవిడ్ వార్డును గురువారం పరిశీలించారు. దవాఖాన ఆవరణ శుభ్రంగా ఉండాలని డాక్టర్లకు సూచించారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని 20వ వార్డులో ఆర్కే ఫంక్షన్హాల్ ప్రాంతంలో రూ.5లక్షలతో చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూ మిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం నల్లకుంట వద్ద నిర్మిస్తున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. అలాగే జడ్చర్లలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల దవాఖాన భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా బాధితుల కోసం జడ్చర్ల ప్రభుత్వ దవాఖానలో 20 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విర్కో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో 30 బెడ్లకు ఆక్సిజన్ అందించేవిధంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈనెల 31న కొవిడ్ బాధితులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డు అందుబాటులోకి వస్తుందన్నారు. జడ్చర్లలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన విర్కో కంపెనీ యాజమాన్యానికి ఎమ్మె ల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో ఎలాం టి సమస్యలు నెలకొన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
దవాఖానలో రోగులకు పూర్తిస్థాయి వైద్యం అందించేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం సూపర్స్ర్పైడర్స్కు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ధా న్యం కొనుగోలును వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్న ట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మ య్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీరవీందర్, వైస్ చైర్పర్సన్ సారికారామ్మోహన్, కౌన్సిలర్లు ఉమాశంకర్గౌడ్, కోట్ల ప్రశాంత్రెడ్డి, జ్యోతి కృష్ణారెడ్డి, శ్రావణి, చైత న్య, నవనీతాకొండల్, రమేశ్, వంశీ, సతీష్, ఇఫ్తేకారొద్దీ న్, మున్సిపల్ కమిషనర్ సునిత, ఏఈ సాయికిరణ్, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళి, జగన్, కృష్ణారెడ్డి, ర వీందర్, రామ్మోహన్, హఫీజ్, బీకేఆర్, దామోదర్, దాని ష్, అర్బన్ హెల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్ పాల్గొన్నారు.