మియాపూర్, జూన్ 26 : కరోనా ప్రభావం ప్రభుత్వ ఖజానాపై పడినా..అభివృద్ధి పనుల విషయంలో ఏమాత్రం లోటు రాకుండా పలు కార్యక్రమాలను చేపడుతూ ముందుకు దూసుకెళ్తుందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా ప్రణాళికాబద్ధంగా పని చేసిందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట , గౌతమినగర్, నిజాంపేట రోడ్డులలో రూ. 1.20 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్ధన్ , ఏఈ రాజీవ్, మహదేవ్, పార్టీ నేతలు దామోదర్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, పోతుల రాజేందర్, కోనేరు కృష్ణప్రసాద్, ఖదీర్, కృష్ణకుమారి, అడ్డగుట్ట, గౌతమినగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు, కాలనీ మహిళలు పాల్గొన్నారు.
మియాపూర్,జూన్26: శాంతిభద్రతల పరిరక్షణకు సీసీకెమెరాలు ఎంతోగానో దోహదం చేస్తాయని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్వెస్ట్ వెల్ఫేర్అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయినగర్వెస్ట్కాలనీలో రూ.4.50లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన 32 సీసీ కెమెరాలను కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్గౌడ్, సీఐ సైదులు, ఎస్ఐ యాదగిరితో కలిసి శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఒక్క సీసీకెమెరా 100మంది పోలీసులతో సమానమని అన్నీకాలనీల అసోసియేషన్లు సీసీలను ఏర్పాటుచేసేందుకు ముందుకురావాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేశ్, నాయకులు రామకృష్ణాగౌడ్, కాశీనాథ్యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, అనిల్రెడ్డి, రాజేశ్చంద్ర, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, అంజలి, సాయినగర్వెస్ట్కాలనీ ప్రెసిడెంట్ ప్రభాకర్, సలహాదారుడు అశోక్, జనరల్ సెక్రటరీ నాగేశ్వర్రావు, శ్రీధర్రావు, కాలనీవాసులు పాల్గొన్నారు.
హఫీజ్పేట్, జూన్26 : లోతట్టుప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న వరదముంపు సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ఖాయిదమ్మకుంట నుంచి సితార హోటల్వరకు రూ.8కోట్లతో మంజూరైన నాలాపనుల్లో భాగంగా పెండింగ్లోఉన్న జనప్రియ ఫేజ్1 పనులు, డాల్ఫిన్ ఎస్టేట్స్లో డ్రైనేజీ, మంజీర నీటి సమస్యలను శనివారం కార్పొరేటర్లు జగదీశ్వర్గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గౌతంగౌడ్, శ్రీనివాస్యాదవ్, సంజీవరెడ్డి, శాంతయ్య, ఉమామహేశ్వరరావు, రవికుమార్, నవీన్, రాందేవ్, కృష్ణప్రసాద్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్, జూన్ 26: జూబ్లీ గార్డెన్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని జూబ్లీ గార్డెన్ అభివృద్ధికి కృషి చేయాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీ గార్డెన్ జనరల్ సెక్రటరీ రమణారెడ్డి, అసోసియేషన్ సభ్యులు నరేందర్రెడ్డి, సురేందర్రావు, మనోజ్, కేవీరావు, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.